About Penchikalpet
MANA PENCHIKALPET
Locality Name : Penchikalpet ( పెంచికల్పేట్ )
Mandal Name : Penchikalpet
District :Komuram Bheem Asifabad
State : Telangana
Region : Telangana
Language : Telugu and Urdu
Time zone: IST (UTC+5:30)
Elevation / Altitude: 187 meters. Above Seal level
Telephone Code / Std Code: 08738
Assembly constituency : Sirpur
Assembly MLA : Koneru Konappa
Lok Sabha constituency : Adilabad
Parliament MP : Godam Nagesh
Sarpanch Name : Routhu Suguna
Pin Code : 504299
Post Office Name : Sirpur (T)
Alternate Village Name : Panchakalapuri
About Penchikalpet
Penchikalpet is a Mandal situated in Komurambheem District of Telangana State, India. It belongs to Telangana region . It is located ~55 KM towards East from District head quarters Asifabad.Penchikalpet Pin code is 504299 and postal head office is Sirpur (T) .
Vodduguda ( 5 KM ) , Yellur ( 7 KM ) , Laggaon ( 7 KM ) , Girvelli ( 8 KM ) , Yelkapalle ( 8 KM ) are the nearby Villages to Penchikalpet. Penchikalpet is surrounded by Bejjur Mandal towards North , Vemanpally Mandal towards South , Bheemini Mandal towards west , Aheri Mandal towards East .
Kagaznagar , Bellampalle , Mandamarri , Mancherial are the near by Cities to Penchikalpet.
This Place is in the border of the Asifabad District and Gadchiroli District. Gadchiroli District Aheri is East towards this place . It is near to the Maharashtra State Border.
Demographics of Penchikalpet
Telugu is the Local Language here. Total population of Penchikalpet is 482 .Males are 228 and Females are 254 living in 103 Houses. Total area of Penchikalpet is 549 hectares.Politics in Penchikalpet
TRS , INC , TDP are the major political parties in this area.How to reach Penchikalpet
Penchikalpet on Google Maps
By Road
Kagaznagar is the Nearest Town to Penchikalpet. Kagaznagar is 37 km from Penchikalpet. Road connectivity is there from Kagaznagar to Penchikalpet.By Rail
There is no railway station near to Penchikalpet in less than 10 km. How ever there are railway Stations from Near By town Kagaznagar. are the railway Stations near to Kagaznagar. You can reach from Kagaznagar to Penchikalpet by road after . How ever Kagaznagar Rail Way Station is major railway station 37 KM near to PenchikalpetColleges near Penchikalpet
Govt Jr College Bejjur
Schools in Penchikalpet
1.ZPSS, Penchikalpet3.Sunrise Primary school, Penchikalpet
4.Maa Minathi adarsha patashala, Penchikalpet
పెంచికల్పేట్ తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన కాగజ్నగర్ నుండి 36 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 132 ఇళ్లతో, 591 జనాభాతో 549 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 281, ఆడవారి సంఖ్య 310. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 232 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 569426[1].పిన్ కోడ్: 504296.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, పెంచికల్పేట్ ఆదిలాబాదు జిల్లా, బెజ్జూర్ మండలంలో భాగంగా ఉండేది.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
సమీప బాలబడి బెజ్జూర్లో ఉంది.
సమీప జూనియర్ కళాశాల బెజ్జూర్లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కాగజ్నగర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఆదిలాబాద్లోను, పాలీటెక్నిక్ బెల్లంపల్లిలోను, మేనేజిమెంటు కళాశాల మంచిర్యాలలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాగజ్నగర్లో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
పెంచికల్పేట్లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. ఆటో సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో స్వయం సహాయక బృందం ఉంది. పౌర సరఫరాల వ్యవస్థ దుకాణం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 5 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
పెంచికల్పేట్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 70 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 127 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 351 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 351 హెక్టార్లు
జీవ వైవిధ్య ప్రదేశం పాలరాపు గుట్ట
అంతరించే దశలో ఉన్న రాబందులకు పెంచికల్పేట్ మండలంలోని పాలరాపు గుట్ట, సురక్షిత స్థావరంగా మారింది. రెండేళ్ల క్రితం వాటి జాడల్ని గుర్తించిన అటవీశాఖ జిల్లా యంత్రాంగం, సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే అదనపు సిబ్బందిని కేటాయించి, 5 లక్షలు ఖర్చు చేసి వాటి సంతతిని పెంచేందుకు అనువైన వాతావరణం కల్పిస్తుండగా ప్రస్తుత పక్షుల సంఖ్య 33కు చేరింది.
సుమారు 35 ఏళ్ల క్రితం దేశంలో కోట్లలో ఉన్న రాబందుల సంఖ్య, గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతమైతే వేలు కూడా లేవు. తెలంగాణలో అయితే పదుల సంఖ్యలో కనిపించడం లేదు. డైక్లోఫెనాక్ లాంటి ఇంజక్షన్లు వాడిన పశువుల కళేబరాలను తినడంతోనే రాబందులు పెద్దసంఖ్యలో చనిపోయాయి. అంతే కాకుండా ఆర్థిక పరిస్థితుల కారణంగా రైతులు తమ పశువులను మాంసం విక్రయదారులకు అమ్ముతుండడంతో ఆహారం దొరక్క ఆ పక్షులు అంతరించి పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబందులు కేవలం మన జిల్లాలో దర్శనమిస్తున్నాయి. పెంచికల్పేట్ మండలం మొర్లిగూడ బీట్లో పాలరాపు గుట్టలో ఆవాసముంటున్నాయి. రెండున్నరేళ్ల (2013 మార్చి) క్రితం వీటి జాడను కనుగొన్న జిల్లా అటవీశాఖ అధికారులు, వాటి రక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
మొదట 15 రాబందులను గుర్తించి, సంరక్షణ కోసం ఐదుగురు బేస్ క్యాంప్ సిబ్బంది (సిడాం సుబ్బరావు, ఆత్రం విష్ణు, ఆత్రం బక్కయ్య, విలాస్, తులసీరాం)తోపాటు ప్రత్యేక పరిశోధకుడు రవికాంత్ను నియమించారు. వీరు ఆ పక్షుల ఆవాసానికి వంద మీటర్ల పరిధిలో పెద్దవాగులో మంచె (షెడ్డు) వేసుకుని, వాటి ఆహారపు అలవాట్లను పరిశీలిస్తున్నారు. బైనాక్యులర్ సహాయంతో కదలికల్ని గమనిస్తున్నారు. ఉదయాన్నే అవి మహారాష్ట్ర ప్రాంతం వైపునకు ఆహారం కోసం వెళ్లి, మధ్యాహ్నం వరకు తమ నోటితో ఆహారం తీసుకొస్తున్నట్లు, గూడు వద్ద మగ లేక ఆడ రాబందు పిల్లలకు కాపలా ఉంటున్నట్లు గుర్తించారు.
రక్షణకు ప్రత్యేక చర్యలు..
రాబందుల రక్షణపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాటి సంతతి పెంచేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి 5 లక్షల నిధులు రాగా రక్షణ, ఆహారం కోసం ఖర్చు చేశారు. గుట్టకు 50 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో రసాయనిక మందుల వాడకం లేకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పశువులకు ఉపయోగించే డైక్లోఫెనాక్ మందులు వాడకుండా స్థానిక వ్యవసాయాధికారులు, ప్రజలకు సూచనలు చేశారు. అంతేకాకుండా గుట్టపై పందిరిలాంటి మంచె వేసి, వాటికి ఆహారం అందిస్తున్నారు. ఇతర జంతువులు అక్కడికిరాకుండా చుట్టూ కంచె నిర్మించారు.
పెరిగిన రాబందుల సంఖ్య..
రెండేళ్ల నుంచి చేపట్టిన రక్షణ చర్యలతో రాబందుల సంఖ్య పెరుగుతోంది. మొదట 15 పక్షులను గుర్తించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 33కు చేరింది. ఆరు నెలల క్రితం 22 పెద్దవి, 11 చిన్న పిల్లలు ఉండేవి. గుట్టపై సురక్షిత ప్రాంతంలో ఏడు గూళ్లను నిర్మించుకున్నాయి. అంతే కాకుండా రెండు సేద తీరే గూళ్లు ఉన్నాయి.
మొదట 15 రాబందులను గుర్తించి, సంరక్షణ కోసం ఐదుగురు బేస్ క్యాంప్ సిబ్బంది (సిడాం సుబ్బరావు, ఆత్రం విష్ణు, ఆత్రం బక్కయ్య, విలాస్, తులసీరాం)తోపాటు ప్రత్యేక పరిశోధకుడు రవికాంత్ను నియమించారు. వీరు ఆ పక్షుల ఆవాసానికి వంద మీటర్ల పరిధిలో పెద్దవాగులో మంచె (షెడ్డు) వేసుకుని, వాటి ఆహారపు అలవాట్లను పరిశీలిస్తున్నారు. బైనాక్యులర్ సహాయంతో కదలికల్ని గమనిస్తున్నారు. ఉదయాన్నే అవి మహారాష్ట్ర ప్రాంతం వైపునకు ఆహారం కోసం వెళ్లి, మధ్యాహ్నం వరకు తమ నోటితో ఆహారం తీసుకొస్తున్నట్లు, గూడు వద్ద మగ లేక ఆడ రాబందు పిల్లలకు కాపలా ఉంటున్నట్లు గుర్తించారు.
రక్షణకు ప్రత్యేక చర్యలు..
రాబందుల రక్షణపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాటి సంతతి పెంచేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి 5 లక్షల నిధులు రాగా రక్షణ, ఆహారం కోసం ఖర్చు చేశారు. గుట్టకు 50 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో రసాయనిక మందుల వాడకం లేకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పశువులకు ఉపయోగించే డైక్లోఫెనాక్ మందులు వాడకుండా స్థానిక వ్యవసాయాధికారులు, ప్రజలకు సూచనలు చేశారు. అంతేకాకుండా గుట్టపై పందిరిలాంటి మంచె వేసి, వాటికి ఆహారం అందిస్తున్నారు. ఇతర జంతువులు అక్కడికిరాకుండా చుట్టూ కంచె నిర్మించారు.
పెరిగిన రాబందుల సంఖ్య..
రెండేళ్ల నుంచి చేపట్టిన రక్షణ చర్యలతో రాబందుల సంఖ్య పెరుగుతోంది. మొదట 15 పక్షులను గుర్తించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 33కు చేరింది. ఆరు నెలల క్రితం 22 పెద్దవి, 11 చిన్న పిల్లలు ఉండేవి. గుట్టపై సురక్షిత ప్రాంతంలో ఏడు గూళ్లను నిర్మించుకున్నాయి. అంతే కాకుండా రెండు సేద తీరే గూళ్లు ఉన్నాయి.
ఉత్పత్తి
పెంచికల్పేట్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 591 - పురుషుల సంఖ్య 281 - స్త్రీల సంఖ్య 310 - గృహాల సంఖ్య 132
Comments
Post a Comment